Coronavirus: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత

60471 New Corona Cases Recorded In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 76 రోజుల్లో అత్యంత తక్కువ రోజువారీ పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 2,95,70,881కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో  2,726 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,77,031 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 1,17,525 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,82,80,472 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 9,13,378   కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు  25,90,44,072 మందికిపైగా వ్యాక్సిన్‌ అందించారు.
 

చదవండి: Delhi: విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top