ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి | 2038 dead due to floods, landslides, lightning since April 1 | Sakshi
Sakshi News home page

ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి

Aug 19 2023 6:35 AM | Updated on Aug 19 2023 6:46 AM

2038 dead due to floods, landslides, lightning since April 1 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 330 మంది చనిపోయారని వివరించింది.

ఏప్రిల్‌ 1–ఆగస్ట్‌ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement