వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించాలి

Aug 22 2025 6:29 AM | Updated on Aug 22 2025 6:29 AM

వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించాలి

వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించాలి

నల్లగొండ టూటౌన్‌ : ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖ్యాతిని చాటాలని ఎంజీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అల్వాల రవి అన్నారు. వెస్ట్‌ జోన్‌ ప్రీ రిపబ్లిక్‌ పరేడ్‌ –2025 కోసం ఎంజీయూ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల ఎంపిక గురువారం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ యూత్‌ ఆఫీసర్‌ సైదానాయక్‌ వలంటీర్లకు రన్నింగ్‌ పరేడ్‌ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనభర్చిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపికై న వలంటీర్లను గుజరాత్‌లో జరిగే పీఆర్‌డీకి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పసుపుల మద్దిలేటి, స్టేట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి నరసింహ, సుధాకర్‌, ఆనంద్‌, శ్రీనివాస్‌, కాంతయ్య, దయానంద్‌, శ్యామల, మేనేశ్వరి, పావని, శృతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement