
ఇందిరమ్మ ఇళ్లను గ్రౌండింగ్ చేయాలి
నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ను పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గృహనిర్మాణ శాఖ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించగా, మొదటి, రెండో విడతలో 3337 గృహాలు మంజూరు చేశామని.. అందులో 1129 గ్రౌండింగ్ కాగా.. బేస్మెంట్ స్థాయిలో 1,037, రూఫ్ లెవెల్లో 67, పూర్తయ్యే దశలో 25 ఇళ్లు ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలాల ప్రత్యేక అధికారులు, గృహ నిర్మాణ ఇంజనీర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్ల గ్రౌండింగ్ను పెంచాలన్నారు. గృహాలు నిర్మించుకునేందుకు సుముఖత లేని లబ్ధిదారుల నుంచి సమ్మతి తీసుకోవాలని సూచించారు. పూర్తయిన గృహాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రారంభోత్సవం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ మున్సిపాలిటీతో పాటు కనగల్, తిప్పర్తి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మంజూరైన గృహాలు గ్రౌండింగ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీఓలపై ఉందని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి