వైన్‌ షాప్‌లో దొంగతనం.. రూ.4లక్షలకు పైగా నగదు ఇంకా మద్యం బాటిళ్లు! | - | Sakshi
Sakshi News home page

వైన్‌ షాప్‌లో దొంగతనం.. రూ.4లక్షలకు పైగా నగదు ఇంకా మద్యం బాటిళ్లు!

Jan 4 2024 1:48 AM | Updated on Jan 4 2024 12:10 PM

- - Sakshi

దొంగతనం జరిగిన వైన్‌ షాపు పరిసరాలను పరిశీలిస్తున్న క్లూస్‌ టీం

రాజాపేట: గుర్తుతెలియని వ్యక్తులు వైన్‌ షాపులో చొరబడి నగదు, మద్యం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాజాపేట మండలంలోని పొట్టిమర్రి గ్రామ పరిధిలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిమర్రి గ్రామ పరిధిలో మాధవరెడ్డి అనే వ్యక్తి అరుణాచల వైన్‌ షాపును నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి 10 గంటలకు రోజుమాదిరిగానే వైన్‌ షాపునకు తాళాలు వేసి వెళ్లిపోయాడు.

బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు వైన్‌ షాపులో దొంగలు పడినట్లు గుర్తించి మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న మాధవరెడ్డి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి క్లూస్‌ టీంను రప్పించి పరిసరాలను పరిశీలించారు.

రూ.4,21,000 నగదుతో పాటు సుమారు మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు వైన్‌ షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement