ఈ మధ్యే 'వీరభద్రుడు'తో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. మరో రెండు నెలల్లో మరో సినిమాతో రాబోతున్నాడు. అదే 'విశ్వనాథ్ & సన్స్'. మమిత బైజు హీరోయిన్. సర్, లక్కీ భాస్కర్ చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ నుంచి తొలి పాటని తాజాగా రిలీజ్ చేశారు.
'నేనో బటర్ ఫ్లై' అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్.. హీరోపై తన ప్రేమని చూపించుకునే సీన్స్ చూపించారు. సరే ఇవన్నీ పక్కనబెడితే 'వీరభద్రుడు' మాస్ మూవీ కాగా.. ఇదేమో క్లాస్ చిత్రం. మరి దీంతో ఎంతవరకు ఆకట్టుకుంటాడనేది చూడాలి?


