సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా నుంచి ‘సిగ్మా స్టైల్’ అంటూ ఈ సినిమా మ్యూజిక్ వీడియోను మలయాళ నటుడు–నిర్మాత దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. ‘‘సందీప్–ఫరియాల డైనమిక్ పెర్ఫార్మెన్స్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ ట్యూన్, జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్తో ‘సిగ్మా స్టైల్’ పాటను ఇన్స్టంట్ చార్ట్బస్టర్గా నిలబెట్టాయి’’ అని యూనిట్ పేర్కొంది.


