breaking news
Jason Sanjay
-
కామెడీ ఎంటర్టైనర్
ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సిగ్మా’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్పోస్టర్ విడుదల చేశారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని చేతికి బ్యాండేజ్ కడుతున్నట్లు కనిపించారు సందీప్. జాసన్ సంజయ్ మాట్లాడుతూ–‘‘యాక్షన్, అడ్వెంచర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సిగ్మా’. ఈ టైటిల్, కాన్సెప్ట్ ‘సిగ్మా’ అనే స్వతంత్ర, ధైర్యవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రెజర్ హంట్, హీస్ట్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే పోస్ట్ప్రోడక్షన్ ప్రారంభించి వేసవి ప్రారంభంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘తొలి సినిమా దర్శకునిగా జేసన్ సంజయ్ 65 రోజుల్లో 95శాతం షూటింగ్ పూర్తి చేయడమంటే అసాధారణ విజయమే’’ అన్నారు లైకాప్రోడక్షన్స్ సీఈఓ తమిళ్ కుమారన్. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
తండ్రి చివరి సినిమా.. కొడుకు మొదటి మూవీ అప్డేట్
తమిళ స్టార్ హీరో తళపతి విజయ్.. తన చివరి సినిమా బిజీలో ఉన్నాడు. 'జన నాయగణ్' పేరుతో తీస్తున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్గా తొలి పాటని రిలీజ్ చేశారు. లాస్ట్ డ్యాన్స్ పేరుతో 'తళపతి కచేరీ' సాగే ఈ గీతం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇదలా ఉండగానే ఇప్పుడు విజయ్ కొడుకు తొలి మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)తళపతి విజయ్కి జేసన్ సంజయ్ అని కొడుకు ఉన్నాడు. తండ్రిలా ఇతడు కూడా హీరో అవుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ దర్శకుడిగా తొలి మూవీ చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం అందరికీ షాకిచ్చాడు. టాలీవుడ్కి చెందిన సందీప్ కిషన్.. ఈ ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా దీని నుంచి అప్డేట్ వచ్చింది. మూవీకి 'సిగ్మా' అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్లో డబ్బు, బంగారం లాంటివి చాలా చూపించారు. అలానే సిగ్మా అనే పదాన్ని ఎక్కువగా యాటిట్యూడ్ చూపించే కుర్రాళ్లు, మగాళ్ల గురించి ఉపయోగిస్తారు. చూస్తుంటే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. తమన్ సంగీత దర్శకుడు కాగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. తండ్రి విజయ్ చివరి సినిమా చేస్తున్నప్పుడే కొడుకు.. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వస్తుండటం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)Presenting the Title of #JSJ01 - #SIGMA⚡The quest begins. 🎯@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @Cinemainmygenes @krishnanvasant @Dir_sanjeev #BenjaminM @hariharalorven @ananth_designer @SureshChandraa @UrsVamsiShekar… pic.twitter.com/Dggm6zx3Il— Lyca Productions (@LycaProductions) November 10, 2025 -
ఒక్క సినిమా కోసం ఇద్దరు వారసులు కలిస్తే..?
ఇద్దరు ప్రముఖుల వారసులు కలిసి చిత్రం చేయడం అనేది అరుదైన విషయమే అవుతుంది. ఇప్పుడు అదే జరగబోతోందా..? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ గురించి తెలిసిందే. తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా కోలీవుడ్లో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆదిత్య వర్మ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత తన తండ్రి విక్రమ్తో కలిసి ధ్రువ్ విక్రమ్ నటించిన మహాన్ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టినా, అది ఓటీటీలో విడుదల కావడంతో ధ్రువ్ విక్రమ్ మంచి థియేటరికల్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరో చిత్రంలో నటించే విషయమై వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రముఖ నటుడు విజయ్ వారసుడు జాసన్ సంజయ్ కూడా సినీ రంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. లండన్లో సినిమా గురించి చదివి వచ్చిన ఈయనకు హీరోగా పలు అవకాశాలు వచ్చినా, వాటిని కాదని దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అలా కథను రెడీ చేసుకున్న జాసన్ సంజయ్కు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అవకాశం కల్పించింది. ఈ సంస్థలో ఈయన దర్శకత్వం వహించనున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది నెలల క్రితమే జరిగాయి. అప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో నటించే హీరోల ఎంపిక చాలా కాలంగా జరుగుతోంది. ఈ వరుసలో నటుడు విజయ్సేతుపతి, కవిన్ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరిగా నటుడు ధ్రువ్ విక్రమ్ను ఇందులో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన చర్చ తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
డైరెక్టర్గా హీరో విజయ్ తనయుడు
తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సుభాస్కరన్ మాట్లాడుతూ– ‘‘కొత్త ఆలోచనలతో ఉండే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ అవుతారని మా నమ్మకం. జాసన్ సంజయ్ విజయ్ చెప్పిన యూనిట్ పాయింట్ మాకు నచ్చింది. సంజయ్ లండన్లో స్క్రీన్ రైటింగ్లో బీఏ (హానర్స్), టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ప్రోడక్షన్ డిప్లామా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అన్నారు. ‘‘లైకాప్రోడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నా ఫస్ట్ మూవీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాసన్ సంజయ్ విజయ్


