breaking news
Sigma Movie
-
విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు
స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగిన రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ సరికొత్త రికార్డ్ సృష్టించారు. అయితే ఇదంతా జరగడానికి కొన్నాళ్ల ముందు వ్యక్తిగతంగా విషయాల కారణంగా ఈయన వార్తల్లో నిలిచారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)భార్యతో విడాకులు, తండ్రి ముఖ్యమంత్రి అయినా సరే కొడుకు జేసన్ ఏం మాట్లాడకపోవడం, సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం లాంటివి జరిగేసరికి విజయ్, అతడి కొడుకు జేసన్ల మధ్య దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ మాటాలు వింటే అలాంటిదేం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి కావడంపై జేసన్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ రాజకీయ విజయాన్ని 'చారిత్రక విప్లవం'గా అభివర్ణించిన జేసన్.. 'నాన్న సీఎం కావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో పెద్ద బాధ్యతతో పాటు గౌరవం కూడా. అదే సమయంలో మేమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు. తండ్రి ఇచ్చిన సలహా గురించి మాట్లాడుతూ.. 'ఆయన నాకు చెప్పిన మాటల్లో నాకు చాలా ఇష్టమైనది ఒకటే. 'నువ్వు నీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి' అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సలహానే నాకు జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చింది. ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా నువ్వే చొరవ తీసుకుని నా దగ్గరకు రావాలి. నేను అడగను అని నాన్న నాతో చెప్పారు' అని జేసన్ చెప్పుకొచ్చాడు.దర్శకుడిని కాకముందు తనకు పూర్తిగా భిన్నమైన ఆలోచనలు ఉండేవని జేసన్ గుర్తుచేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని, తర్వాత క్రికెటర్ కావాలని బలమైన కోరిక ఉండేది. 'నాకు క్రికెట్ అంటే పిచ్చి. బ్యాటింగ్ చేయడం ఇష్టం. కానీ నా అసలు ప్రతిభ బౌలింగ్లోనే ఉంది. ఇంటర్లో ఉన్నప్పుడు కథలు చెప్పడం, సినిమాలు తీయడంపై ఆసక్తి వచ్చింది. దీంతో ఇదే నా కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాక ఏం చేయాలనుకుంటున్నానో క్లారిటీ వచ్చింది. మా నాన్న విజయ్ సినిమాకు దర్శకత్వం వహించాలన్నది నా కల. ఆయనతో పాటు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను' అని జేసన్ చెప్పుకొచ్చాడు.జేసన్ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో కాగా తమన్ సంగీతమందించాడు. లెక్క ప్రకారం జూలై 31నే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)This is “HISTORIC REVOLUTION” - #JasonSanjay about his father @actorvijay’s Election Victory 🔥 pic.twitter.com/RWF6wkNIvP— Vijay Fans Trends (@VijayFansTrends) August 1, 2026 -
సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?
హీరోగా స్టార్డమ్ అనుభవించిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు జేసన్ సంజయ్ లండన్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చేసొచ్చాడు. ఈ క్రమంలోనే తండ్రిలా హీరో అవుతాడనుకుంటే జేసన్ మాత్రం అందరికీ షాకిస్తూ డైరెక్టర్ అయ్యాడు. సిగ్మా పేరుతో ఓ మూవీ తీశాడు. ఇది ఈ నెల 31న రిలీజ్ కావాలి కానీ 'జన నాయగన్' కారణంగా వాయిదా పడేలా ఉంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)ఈ సినిమాలోనే జేసన్ సంజయ్ ఒక పాటలోనూ నటించడం విశేషం. దీంతో పలువురు సినీ ప్రముఖులు జేసన్.. హీరోగానూ త్వరలో ఎంట్రీ ఇస్తారని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే విజయ్ కొడుకు హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిని తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్ కుమరన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ తీయబోయే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన 'సిగ్మా' రిలీజైన తర్వాత రానుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు) -
విజయ్ చివరి సినిమా.. కొడుకు ఊహించని నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చిట్టచివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు తగ్గట్లే వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో మూవీని రిలీజ్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దాదాపు ఈ తేదీ కన్ఫర్మ్ అయినప్పటికీ నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా)విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో కొడుకు జేసన్, తండ్రి నుంచి దూరంగా తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే జేసన్.. తండ్రిలా హీరో అవుతాడని అంతా అనుకున్నారు కానీ దర్శకుడిగా మారి 'సిగ్మా' అనే మూవీ తీశాడు. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. దీన్ని జూలై 31న రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ 'జన నాయగన్'.. ఆ తేదీకి సరిగ్గా వారం ముందే వస్తున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేయాలని 'సిగ్మా' టీమ్ అనుకుంటోందట.ప్రస్తుతం 'సిగ్మా' వాయిదా రూమర్స్ కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు అవుతుంది. ఇకపోతే 'భగవంత్ కేసరి' రీమేక్ అయిన 'జన నాయగన్'లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు.(ఇదీ చదవండి: నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?) -
సిగ్మా స్టైల్
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా నుంచి ‘సిగ్మా స్టైల్’ అంటూ ఈ సినిమా మ్యూజిక్ వీడియోను మలయాళ నటుడు–నిర్మాత దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. ‘‘సందీప్–ఫరియాల డైనమిక్ పెర్ఫార్మెన్స్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ ట్యూన్, జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్తో ‘సిగ్మా స్టైల్’ పాటను ఇన్స్టంట్ చార్ట్బస్టర్గా నిలబెట్టాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు
తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్ కొన్నిరోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవితంలోని విడాకుల వ్యవహారంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విజయ్ భార్య సంగీత ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే తన కూతురు, కొడుకుని తీసుకుని లండన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆమె చెన్నైలో లేరు.(ఇదీ చదవండి: అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్)మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. తండ్రిలా హీరో అవుతాడనుకుంటే ఊహించని విధంగా దర్శకుడిగా మారిపోయాడు. 'సిగ్మా' పేరుతో ఓ మూవీ తీస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ హీరో కాగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడో సర్ప్రైజ్ వచ్చేసింది. జూలై 31వ తేదీన థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.తండ్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్' రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇంతలోనే కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా' మాత్రం విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. మరి తండ్రి నుంచి దూరంగా ఉంటున్న జేసన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి విజయ్ అభిమానులు ఏ మేరకు సపోర్ట్ చేస్తారో చూడాలి? అయిత 'జన నాయగణ్' కూడా వచ్చే నెలలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే నెల గ్యాప్లో తండ్రీకొడుకుల సినిమాలు వచ్చినట్లు అవుతుంది.(ఇదీ చదవండి: ఖుష్బూ ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత)A high-stakes heist begins. 💵 #SIGMA storms into theatres on July 31st. 🗓️ Gear up for the ultimate quest. 🔥@LycaProductions #Subaskaran @gkmtamilkumaran @jsjmedia01 @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu @yogjapee… pic.twitter.com/BWMFY3sBwN— Jason Sanjay Official (@official_jsj) May 29, 2026 -
కామెడీ ఎంటర్టైనర్
ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సిగ్మా’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్పోస్టర్ విడుదల చేశారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని చేతికి బ్యాండేజ్ కడుతున్నట్లు కనిపించారు సందీప్. జాసన్ సంజయ్ మాట్లాడుతూ–‘‘యాక్షన్, అడ్వెంచర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సిగ్మా’. ఈ టైటిల్, కాన్సెప్ట్ ‘సిగ్మా’ అనే స్వతంత్ర, ధైర్యవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రెజర్ హంట్, హీస్ట్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే పోస్ట్ప్రోడక్షన్ ప్రారంభించి వేసవి ప్రారంభంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘తొలి సినిమా దర్శకునిగా జేసన్ సంజయ్ 65 రోజుల్లో 95శాతం షూటింగ్ పూర్తి చేయడమంటే అసాధారణ విజయమే’’ అన్నారు లైకాప్రోడక్షన్స్ సీఈఓ తమిళ్ కుమారన్. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
తండ్రి చివరి సినిమా.. కొడుకు మొదటి మూవీ అప్డేట్
తమిళ స్టార్ హీరో తళపతి విజయ్.. తన చివరి సినిమా బిజీలో ఉన్నాడు. 'జన నాయగణ్' పేరుతో తీస్తున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్గా తొలి పాటని రిలీజ్ చేశారు. లాస్ట్ డ్యాన్స్ పేరుతో 'తళపతి కచేరీ' సాగే ఈ గీతం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇదలా ఉండగానే ఇప్పుడు విజయ్ కొడుకు తొలి మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)తళపతి విజయ్కి జేసన్ సంజయ్ అని కొడుకు ఉన్నాడు. తండ్రిలా ఇతడు కూడా హీరో అవుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ దర్శకుడిగా తొలి మూవీ చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం అందరికీ షాకిచ్చాడు. టాలీవుడ్కి చెందిన సందీప్ కిషన్.. ఈ ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా దీని నుంచి అప్డేట్ వచ్చింది. మూవీకి 'సిగ్మా' అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్లో డబ్బు, బంగారం లాంటివి చాలా చూపించారు. అలానే సిగ్మా అనే పదాన్ని ఎక్కువగా యాటిట్యూడ్ చూపించే కుర్రాళ్లు, మగాళ్ల గురించి ఉపయోగిస్తారు. చూస్తుంటే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. తమన్ సంగీత దర్శకుడు కాగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. తండ్రి విజయ్ చివరి సినిమా చేస్తున్నప్పుడే కొడుకు.. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వస్తుండటం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)Presenting the Title of #JSJ01 - #SIGMA⚡The quest begins. 🎯@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @Cinemainmygenes @krishnanvasant @Dir_sanjeev #BenjaminM @hariharalorven @ananth_designer @SureshChandraa @UrsVamsiShekar… pic.twitter.com/Dggm6zx3Il— Lyca Productions (@LycaProductions) November 10, 2025


