
‘నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా..’ అంటూ విజయ్ దేవరకొండ పాడగా, ‘పదము నీ వైపిలా.. పరుగు నీదే కదా..’ అంటున్నారు సమంత. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రంలోని రెండో పాట ఇది. ఈ చిత్రదర్శకుడు శివ నిర్వాణ తెలుగు వెర్షన్కి ఈ పాట రాయగా, తమి ళంలో మదన్ కార్కీ సాహిత్యం అందించారు.
తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి, హిందీలో జుబిన్ నాటియల్, పలక్ ముచ్చల్, కన్నడంలో హరిచరణ్ శేషాద్రి, చిన్మయి, మలయాళంలో కేఎస్ హరిశంకర్, శ్వేతా మోహన్ ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.