సినీ ఇండస్ట్రీలో సమస్యలు: 30 మందితో కమిటీ ఏర్పాటు | Tollywood: Special Committee Formed by Telugu Film Chamber | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ సమస్యలు తీర్చేందుకు కొత్త కమిటీ..

Jun 7 2025 1:59 PM | Updated on Jun 7 2025 3:44 PM

Tollywood: Special Committee Formed by Telugu Film Chamber

సాక్షి, హైదరాబాద్‌: వెలవెలబోతున్న థియేటర్లు, నెలరోజుల్లోనే ఓటీటీ (OTT)లోకి సినిమాలు, సినిమా రిలీజ్‌ కష్టాలు.. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)ను ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్.. అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. 

ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ విభాగాల నుంచి పది మంది చొప్పున సభ్యులుగా తీసుకుంది. మొత్తం 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. దీనికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

ఏ విభాగంలో ఎవరున్నారంటే?
నిర్మాతల విభాగం: దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ

డిస్ట్రిబ్యూటర్‌ విభాగం: భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం.సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి

గత కొన్నిరోజులగా తెలుగు సినీ పరిశ్రమలో విభేదాలు

ఎగ్జిబిటర్‌ విభాగం: రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి.

చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement