
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ చిత్రం చౌర్యపాఠం. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో సందడి చేసింది. అయితే ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసిన 'చౌర్య పాఠం (Chaurya paatam) ఓటీటీలో దూసుకెళ్తోంది. ఏకంగా టాప్ టెన్లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ అమెజాన్లో టాప్-7లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చౌర్యపాఠం మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
(ఇది చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
ఈ సినిమా కథేంటంటే..
చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.