Chaurya Paatam Movie
-
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. కానీ
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ అలానే ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?గత నెల 24న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'చౌర్యపాఠం'. బ్యాంక్ దొంగతనం నేపథ్య కథతో తీశారు. బాగానే ప్రమోట్ చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ (విదేశాల్లో) తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) బహుశా వచ్చే వారం మన దేశంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావొచ్చు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు కాగా మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఆ ఆశ, ఆలోచన నాకు లేదు: త్రినాథరావు నక్కిన
‘‘పన్నెండేళ్ల నా కెరీర్లో ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించాను. అయితే వేగంగా సినిమాలు చేసి, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన, ఆశ నాకు లేదు. నంబర్లు తక్కువ అయినా మంచి సినిమాలు తీయాలన్నదే నా ఆకాంక్ష. అందుకే నిదానంగా చేసుకుంటూ వెళుతున్నాను’’ అని త్రినాథరావు నక్కిన చెప్పారు. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందిన చిత్రం ‘చౌర్య పాఠం’. కార్తీక్ ఘట్టమనేని కథ అందించిన ఈ సినిమా ద్వారా చందు మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్పై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో త్రినాథరావు విలేకరులతో పంచుకున్న విశేషాలు.→ కార్తీక్ ఘట్టమనేని తండ్రి ఐజీగా చేశారు. ఆయన హయాంలో జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసు గురించి కార్తీక్ చెప్పినప్పుడు సరదాగా అనిపించింది. ఈ నేపథ్యంలో సినిమా చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ కేసుని స్ఫూర్తిగా తీసుకొని ఫిక్షన్ యాడ్ చేసి, ఈ కథ రాశాడు కార్తీక్. ఈ సినిమాకి దర్శకుడిగా నిఖిల్ గొల్లమారి పేరుని తనే చెప్పాడు. ‘కార్తికేయ’ సినిమా షూటింగ్లో తన చురుకుదనం, ప్రతిభని గుర్తించాను. దీంతో ఓకే చెప్పాను. తను ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్ని మాత్రం మూడుసార్లు మార్పించాను. ఆ తర్వాత ఫైనల్ కాపీ చూసుకున్నాక చాలా బాగుందనిపించింది. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ కథకి రెండింతలు న్యాయం చేశాడు. ఈ చిత్రం దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా ఉంటుంది (నవ్వుతూ). → కొత్తవాళ్లకి ఒక వేదిక సృష్టించి, అవకాశాలు ఇవ్వాలన్నది నా కల. ఎప్పటి నుంచో ఉన్న ఆ కల ‘చౌర్యపాఠం’తో నెరవేరింది. నిర్మాతగా మారి డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదు. కేవలం కొత్తవారికి అవకాశం కల్పించా లనే మంచి ఉద్దేశంతోనే నిర్మాతగా మారాను. మేం అనుకున్నదాని కంటే పది శాతం బడ్జెట్ పెరిగింది. మా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో రాజీ పడకుండా మంచి క్యాలిటీతో తీశాం.→ ఇంద్ర రామ్ ఈ కథకి సరిగ్గా సరి΄ోయాడు. కొత్తవాడు కదా సరిగ్గా చేస్తాడో? లేదో అనుకున్నాం. సెట్స్కి వెళ్లాక రెండు రోజులు కంగారు పడినా, ఆ తర్వాత బాగా నటించాడు. అలానే ΄ాయల్ రాధాకృష్ణ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా చక్కగా నటించింది. → ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్కి రావడం తగ్గించడానికి చాలా కారణాలున్నాయి. వాళ్లని థియేటర్స్కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం హవీష్ హీరోగా నా డైరెక్షన్లో చేస్తున్న సినిమా 25 శాతం పూర్తయింది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, ‘దిల్’ రాజుగారి బ్యానర్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్లో సినిమాలు చేయాల్సి ఉంది. -
ఆర్ఎక్స్ 100 నేను చేయాల్సిన సినిమా: యంగ్ హీరో
కోర్ట్, కమిటీ కుర్రాళ్లు సినిమాలు కూడా కొత్త వారితో తీసినవే. అవి మంచి విజయాల్ని సాధించాయి. అలాగే మా ‘చౌర్య పాఠం’ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమాని అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు యంగ్ హీరో ఇంద్ర రామ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘చౌర్య పాఠం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు ఈ చిత్రంతో ప్రొడక్షన్స్లోకి అడుగుపెడుతున్నారు.కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఇంద్ర రామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మాది విజయవాడ. అక్కడే చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ చేశాను. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇంట్రస్ట్ ఇటు వైపు తీసుకొస్తుందని భావిస్తున్నాను. నక్కిన గారు ఈ ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. అలా ఈ జర్నీ మొదలైయింది. ఈ సినిమాలో కథే మెయిన్ హీరో. ఈ సినిమాని హానెస్ట్ గా చేశాం. నక్కిన త్రినాథ్ గారు చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు.⇢ ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. కథా రచయిత కార్తిక్ వాళ్ళ ఫాదర్ ఐజి గా పని చేశారు. ఇలాంటి కేసుని ఆయన టేకాఫ్ చేశారు. ఒక వీధిలో బ్యాంక్ ఉంటే మరో వీధిలో రూమ్ ని తీసుకొని అక్కడ నుంచి టన్నల్ తవ్వి బ్యాంక్ లోకి చొరబడ్డ సంఘటన జరిగింది. దానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాని చేయడం జరిగింది.⇢ ఈ సినిమా కోసం చాలా హోం వర్క్ చేశాం. ఇలాంటి సినిమా చేయడానికి ఎలాంటి రిఫరెన్స్ ఉండదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమాలో టన్నల్స్ క్రియేట్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నారు. ఇదొక డిఫరెంట్ వరల్డ్. చాలా కష్టపడ్డాం. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో ఒక ఫిక్షనల్ విలేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది.⇢ ఈ సినిమాకి విజయ సేతుపతి గారు, నాగచైతన్య గారు, వరుణ్ తేజ్ అన్న అందరూ సపోర్ట్ చేశారు. అలాగే సజ్జనార్ గారి ఇంటర్వ్యూ కూడా చాలా హెల్ప్ అయ్యింది.⇢ నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టం. సినిమా అవకాశం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. వంగవీటి సినిమా సమయంలో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దర్శకుడు అజయ్ భూపతితో నాకు జర్నీ వుంది. ఆర్ఎక్స్ 100 నేను చేయల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. కార్తికేయ అద్భుతంగా చేశాడు.