గ్లోబల్ స్టార్‌ అరుదైన ఘనత.. ఆ దిగ్గజాల పక్కన ఛాన్స్! | Tollywood Hero Ram Charan Honoured to Join MadameTussauds Museum | Sakshi
Sakshi News home page

Ram Charan: గ్లోబల్ స్టార్‌ అరుదైన ఘనత.. ఆమె తర్వాత చెర్రీకి దక్కిన గౌరవం!

Oct 22 2024 9:27 PM | Updated on Oct 22 2024 9:27 PM

Tollywood Hero Ram Charan Honoured to Join MadameTussauds Museum

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. తాజాగా అబుదాబిలో జరుగుతున్న  ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే చరణ్‌ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్‌లో విగ్రహాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే రామ్‌చరణ్‌ పెంపుడు శునకం రైమ్‌ కూడా మైనపు విగ్రహంలో కనిపించనుంది. క్వీన్‌ ఎలిజిబెత్‌-2 తర్వాత ఇలా పెట్‌తో ఉన్న వారిలో రెండో వ్యక్తిగా చెర్రీ ఘనత సాధించారు. కాగా.. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో షారూక్‌ ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌, కాజోల్‌, కరణ్‌ జోహార్‌ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి.

r

ఈ అరుదైన గౌరవం దక్కటం పట్ల రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు.  లెజెండరీ నటుల విగ్రహాల పక్కన ఉండేలా గౌరవం దక్కుతుందని కలలోనూ ఊహించలేదన్నారు. సినిమాపై నాకున్న ప్యాషన్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ అవకాశమిచ్చిన మేడమ్‌ టుస్సాడ్స్‌ ప్రతినిధులకు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్‌ సినిమా స్టార్స్‌ను మేడమ్‌ టుస్సాడ్స్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని మ్యూజియం ప్రతినిధులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement