
ఎన్టీఆర్తో స్పెషల్ డ్యాన్స్ చేయనున్నారట శ్రుతీహాసన్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఈ పాటకు శ్రుతీహాసన్ అయితే బాగుంటారని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నారట.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘సలార్’ మూవీలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించారు శ్రుతీహాసన్. మరి... ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీలోని శ్రుతి స్పెషల్ సాంగ్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతోంది.
ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలిసింది. మూడు రోజుల క్రితం మొదలైన ఈ షెడ్యూల్ మే రెండో వారం వరకు జరుగుతుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గతంలో వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.