
సాక్షి, హైదరాబాద్: కోకాపేటలోని రాజ్తరుణ్ ఇంటివద్ద జరిగిన హైడ్రామాకు తెరపడింది. రాజ్ తరుణ్ (Raj Tarun) తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వని లావణ్య నేడు (ఏప్రిల్ 17) ఉదయం మనసు మార్చుకుంది. వారు ఇంట్లోకి వచ్చేందుకు ఓకే చెప్పింది. దీంతో రాజ్తరుణ్ పేరెంట్స్ను పోలీసులు ఇంట్లోకి పంపించారు. కాగా సూరారంలో ఉంటున్న రాజ్తరుణ్ తల్లిదండ్రులు అక్కడ అద్దె ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుమారుడి ఇంటికి వచ్చారు.
తీరా వచ్చి చూస్తే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. వారిని లోపలకు రానివ్వకుండా అడ్డుకుంది. అంతేకాకుండా రాజ్తరుణ్ పేరెంట్స్ పదిమందితో వచ్చి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గెంటేయడానికే వచ్చారని ఆరోపించింది. దీంతో రాజ్తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయటే ఉండిపోయారు. కొడుకు కష్టార్జితంతో కొన్న ఇంట్లోకి రానివవడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసుల జోక్యంతో వారు విల్లాలో అడుగుపెట్టారు.
ఆడియో కాల్ వైరల్
ఇదిలా ఉంటే రాజ్తరుణ్, లావణ్య, అరియానా గ్లోరీ ఫోన్ కాల్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అందులో అరియానా.. నా ఇంట్లో నేను చెప్పేశా.. ఈ అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్. ఇకపై నాతోనే కలిసి జీవిస్తాడని చెప్పాను. మరి నీ లైఫ్లో నేనేంటో చెప్పు? అని రాజ్తరుణ్ను నిలదీసింది. అతడు నీకు ఫ్రెండ్గా ఉంటాడని లావణ్య అంటుంటే.. నాకు ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ కంటే ఎక్కువ అని అరియానా పేర్కొంది. ఫ్రెండ్ కాకపోతే మీ మధ్య ఏముందో చెప్పండి. రిలేషన్లో ఉన్నారా? ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకుంటారా? ఏంటో చెప్పండి అని లావణ్య నిలదీసింది. దానికి మాత్రం అరియానా క్లారిటీ ఇవ్వలేదు.
చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?