Late Actor Puneeth Rajkumar: పిల్లలందరు ఈ సినిమా చూడాలన్నది ఆయన కోరిక: పునీత్‌ భార్య అశ్విని

Puneeth Rajkumar Wife Wrote Letter to Kannada Audience Over Gandhada Gudi Movie - Sakshi

దివంగ నటుడు, కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం ‘గంధర గుడి’. వైల్డ్‌ లైఫ్‌ డాక్యుమెంటరి చిత్రంగా ఈ మూవీ రూపొందింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కర్ణాటక ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలను సైతం బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్ణాటక అడవులను, వాటిలోని ప్రాముఖ్యతను కన్నడిగులకు తెలియాలజేయాలనే ఉద్ధేశంతో పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈ మూవీ చేశారట.

చదవండి: విశ్వక్‌ సేన్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు?

ఈ విషయాన్ని తాజాగా ఆయన భార్య అశ్విని రేవంత్‌ తెలిపారు. ఈ మేరకు ఆమె కర్ణాటక ప్రేక్షకులను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేశారు. ‘‘గంధద గుడి.. ఇది పునీత్‌ రాజ్‌కుమార్‌ కలల చిత్రం. కర్ణాటక అడవుల అందాలు అందరికీ చూపించాలని ఆయన ఈ సినిమా చేశారు. కన్నడ ప్రజలందరూ ఈ సినిమా చూడలన్నది ఆయన కోరిక. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రం చూడాలని అప్పు(పునీత్) ఎంతగానో కోరుకున్నారు.  మన పిల్లల కోసం మన అడవులను కాపాడుకుందాం. వాళ్లకి కర్ణాటక అందాలను చూపిద్దాం’’ అని ఆమె లేఖలో పేర్కొ‍న్నారు. 

చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్‌, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’

కాగా అమోఘవర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పునీత్‌ భార్య అశ్వినీ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్‌ 28న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన కొద్ది రోజులకే పునీత్‌ గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయన మరణించిన కొన్ని రోజు రోజులకే ఈ మూవీ ట్రైలర్‌ విడుదల కాగా విశేష ఆదరణ అందుకుంది. ప్రధానీ నరేంద్ర మోదీ సైతం గంధర గుడి ట్రైలర్‌పై స్పందించారు. ‘పునీత్‌ కోట్లాది మంది హృదయాలలో జీవిస్తూనే ఉంటారు. ఆయన ఎంతో ప్రతిభ కలిగిన నటులు. గంధద గుడి సినిమా కర్ణాటక ప్రకృతి సౌందర్యాన్ని చూపుతోంది. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు’ అని మోదీ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top