పవన్‌, క్రిష్‌ సినిమాకు మళ్లీ బ్రేక్‌.. కారణమేంటంటే!

Pawan Kalyan To Take Break From Krish Movie - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వకీల్‌సాబ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా దర్శకుడు క్రిష్‌, పవన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఇప్పటికే పవన్‌ చిత్రీకరణలో జాయిన్‌ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌ గురువారంతో పూర్తి కానుంది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను కంప్లీట్‌ చేయనున్నాడు క్రిష్‌. ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది.
చదవండి: పవన్‌ సినిమాలో అనసూయకు 'స్పెషల్‌' ఛాన్స్‌.?

ప్రస్తుత షెడ్యూల్‌ అయిపోయిన తర్వాత 20 రోజులపాటు షూటింగ్‌కు విరామం ఇవ్వనున్నాడు పవన్‌. ఆ తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నాడు. అయితే ఈ మధ్య సమయంలో ‘అయ్యపనుమ్‌ కోషియమ్‌’ షూటింగ్‌లోకి ఎంటర్‌ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటించగా.. బిజూ మీనన్‌ పాత్రను పవన్ కల్యాణ్‌, రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఈ రెండు చిత్రాల అనంతరం రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. అంతేగాక వైపు పవన్‌తో సినిమా కోసం హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కథలతో సిద్ధంగా ఉన్నారు.
చదవండి: పవన్‌కు త్రివిక్రమ్‌ మాట సాయం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top