ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'కళ్యాణం కమనీయం జీవితం'. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ రిలీజ్కు సిద్ధమవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. సమంతకు సీమంతం)
తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, జెమినీ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.
డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ - నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తీశాను. చాలా మంచి లవ్ స్టోరీ ఇది. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుందని చెప్పారు.
(ఇదీ చదవండి: ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి)


