ప్రముఖ బ్రాండ్‌కు ప్రచార కర్తగా కీర్తి సురేష్‌ | Heroine Keerthy Suresh Brand Ambassidor Of Ponds skin Institute | Sakshi
Sakshi News home page

Keerthy Suresh : పాండ్స్‌ ప్రచార కర్తగా కీర్తి సురేష్‌

Jun 6 2024 3:04 PM | Updated on Jun 6 2024 3:27 PM

Heroine Keerthy Suresh Brand Ambassidor Of Ponds skin Institute

పాండ్స్ స్కిన్ ఇన్‌స్టిట్యూట్ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను నియమించుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను దక్షిణ భారతదేశంలోని కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. పాండ్స్ స్కిన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి చాలా ఉత్పత్తులు ఉన్నాయి. స్కిన్‌ కేర్‌ విషయంలో శ్రేష్ఠతకు స్థిరంగా బెంచ్‌మార్క్‌ను పాండ్స్‌ సెట్ చేసింది.

పాండ్స్ స్కిన్ ఇన్‌స్టిట్యూట్ అంబాసిడర్‌గా తన కొత్త పాత్రపై కీర్తి సురేష్ మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా మెచ్చుకుంటున్న పాండ్స్ స్కిన్ ఇన్‌స్టిట్యూట్‌తో చేతులు కలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది హృదయాల్లో ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.' అని ఆమె తెలిపింది.


హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, స్కిన్‌కేర్ హెడ్ ప్రతీక్ వేద్ తమ భాగస్వామ్యం గురించి ఇలా వ్యాఖ్యానించారు. 'పాండ్స్ స్కిన్ ఇన్‌స్టిట్యూట్‌లో, టైమ్‌లెస్ బ్యూటీ సొల్యూషన్‌లను రూపొందించే ఆవిష్కరణ శక్తిని మేము విశ్వసిస్తున్నాము. కీర్తిని మా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా స్వాగతించడం మా వినియోగదారులతో బలమైన సంబంధాన్ని ఏర్పరిచే మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. ఆమె చక్కదనానికి ప్రతిభ, అందం మా బ్రాండ్‌కు కూడా కలిసొస్తుంది.' అని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement