తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ హీరో హీరోయిన్లుగా పల్లెటూరి నేపథ్యంలో ‘ఓ.! సుకుమారి’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తిరువీర్ పోషిస్తున్న యాదగిరి పాత్ర లుక్ని సోమవారం రిలీజ్ చేశారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘‘మా బేనర్లో విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.! సుకుమారి’. ఈ చిత్రంలో తిరువీర్ పల్లెటూరి యువకుడిలా మాస్ పాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.


