
సుహాస్, సూరి కలిసి నటిస్తున్న ‘మండాడి’ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు.
రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది.
మండాడి విషయానికొస్తే.. క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో సుహాస్ హీరోగా సూరి విలన్గా కనిపించనున్నాడు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
Video - A boat capsized during the shooting of #Soori's film #Mandaadi, causing damage to the cameras on board....🫣
- This kind of accident happened while the shooting of this film was taking place at a location called Thundi in Ramanathapuram....🥹
pic.twitter.com/yDjTrLOHT1— Movie Tamil (@_MovieTamil) October 4, 2025
