న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. డ్రైవర్ ఫోన్లో పాకిస్థాన్కు చెందిన వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన స్వాతి గోయల్ శర్మ ఇటీవల ఉబర్ క్యాబ్లో ప్రయాణించారు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా ఆమె గమనించారు. ‘మీరు పాకిస్థాన్ నుంచా?’ అని డ్రైవర్ అంటుండటంతో ఆమె అప్రమత్తమయ్యారు. వెంటనే తన ఫోన్ తీసి ఆ సంభాషణను దాదాపు 51 సెకన్ల పాటు వీడియో రికార్డు చేశారు.
రైడ్ ముగిసిన తర్వాత మహిళ ఆ డ్రైవర్ను నిలదీయగా.. తాను ‘ట్రూమీట్’ అనే మొబైల్ యాప్లోని ఓ గ్రూప్లో సభ్యుడిగా ఉన్నానని, అందులో చాలా మంది పాకిస్థానీలు కూడా ఉన్నారని డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఆ యాప్లో భారతీయులను మతపరమైన చర్చల్లోకి లాగుతుంటారని, హిందూ ఆచారాలపై అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటారని డ్రైవర్ వివరించినట్లు స్వాతి తెలిపారు.
In the Uber cab I took today, I overheard the driver saying - “aap pakistan se ho na…”
I started recording after that. The driver started - aapki Mecca medina mein pehle shivling thi..”
You can hear the rest of what he said in this video till my destination arrived
Before… pic.twitter.com/c9GbBxwgGz— Swati Goel Sharma (@swati_gs) July 21, 2026
ఈ తరహా చాటింగ్ యాప్ల ద్వారా ఉగ్రవాద సంస్థలు ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్వాతి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా ఏజెన్సీలు ఇలాంటి వాటిపై నిఘా వేయాలని, ఇలాంటి విదేశీ యాప్ల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్షాట్లు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏఐతో భారీ సంక్షోభం: జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ భవిష్యవాణి!


