
వెండితెరపైకి బాహుబలి తిరిగొస్తున్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి.
ఈ రెండు చిత్రాలూ బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నాం.
ఇండియాలోనే కాదు.. ఇంటర్నేషనల్గా కూడా ఈ రీ–రిలీజ్ ఉంటుంది. కొన్ని సర్ప్రైజ్లూ ఉంటాయి. బాహుబలి రిటర్న్స్’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రీ రిలీజ్ విషయాన్ని మేకర్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రీ–రిలీజ్ విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు మేకర్స్.