ఐశ్వర్యా రాజేశ్ లీడ్ రోల్స్లో నటించిన తమిళ చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ తెలుగులో ‘మఫ్టీ ΄ోలీస్’ టైటిల్తో రేపు రిలీజ్ కానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు.
‘‘ఒక రచయిత హత్య నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలి కాలంలో కొందరు పిల్లలకు ఇబ్బందిగా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఈ సినిమాలో చర్చించడం జరిగింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు ఏఎన్ బాలాజీ.


