ఖైదీ సీక్వెల్‌లో అమలాపాల్‌ | Amala Paul Entered Bollywood With Khaidi Movie | Sakshi
Sakshi News home page

ఖైదీ సీక్వెల్‌లో అమలాపాల్‌

Apr 6 2025 7:02 AM | Updated on Apr 6 2025 4:39 PM

Amala Paul Entered Bollywood With Khaidi Movie

కోలీవుడ్‌ నటుడు కార్తీ కథానాయకుడుగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఖైదీ. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్సార్‌ ప్రకాష్‌ బాబు, ఎస్సార్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. కాగా త్వరలో ఈ చిత్రానికి సీక్వల్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఖైదీ చిత్రాన్ని హిందీలో నటుడు అజయ్‌ దేవగన్‌ 'భోలా' పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది.  తమిళం కార్తీ కథానాయకుడిగా నటించిన పాత్రను హిందీలో అజయ్‌ దేవగన్‌ పోషించారు. నరేన్‌ పాత్రలో నటి టబు కనిపించారు.

అజయ్‌ దేవగన్‌ ఫిలిమ్స్‌ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నటి అమలాపాల్‌ కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను బాలీవుడ్‌లో కూడా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను యూనిట్‌ వర్గాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా 2009లో మలయాళంలో నీలతామర అనే చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అమలాపాల్‌ తమిళంలో వీరశేఖరన్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా మలయాళం ,తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రముఖ హీరోల సరసన కథానాయకగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు మనస్పర్ధల కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలో నటించడం మొదలెట్టిన అమలాపాల్‌ అదేవిధంగా జగత్‌ దేశాయ్‌ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక పాప కూడా పుట్టింది. కాగా అమలాపాల్‌ నటించిన మలయాళ చిత్రం గోట్‌ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆమె తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. కాగా తాజాగా బాలీవుడ్‌లోకి ఖైదీ2తో మరోసారి సందడి చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement