హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం | Adah Sharma Moves Into Sushant Singh Rajput's Flat | Sakshi
Sakshi News home page

Sushant Singh Rajput: దివంగత హీరో ఫ్లాట్‌లోకి హీరోయిన్ అదా శర్మ

Jun 2 2024 9:38 PM | Updated on Jun 3 2024 9:57 AM

Adah Sharma Moves Into Sushant Singh Rajput Flat

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పేరు చెప్పగానే చాలామంది ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఎంతో పెద్ద కెరీర్ ఉన్న హీరో.. ఊహించని విధంగా తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హిందీ ఇండస్ట్రీలోని నెపోటిజం వల్ల ఇలా జరిగిందని రచ్చ రచ్చ జరిగింది.

(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?)

అలాంటిది ఆ ఫ్లాట్‌లో యంగ్ హీరోయిన్ అదాశర్మ మకాం పెట్టేసింది. దాదాపు నాలుగు నెలల క్రితమే తాను ఈ ప్లేసులోకి షిఫ్ట్ అయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. 'ద కేరళ స్టోరీ' సినిమాతో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అదా.. సుశాంత్ ఫ్లాట్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

'నేను నాలుగు నెలల క్రితమే ఈ ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యాను. కానీ నా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటం వల్ల సర్దుకోవడం కుదర్లేదు. ఈ మధ్య పూర్తిగా వస్తువులు, సామాన్లు అన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కేరళ, ముంబయిలోని మా ఇళ్ల చుట్టూ చెట్లు ఉంటాయి. అందుకే చుట్టూ పచ్చని వాతావరణం ఉన్న ఈ ఇంటికి మారాను. అలానే ఈ ఫ్లాట్‌లోకి వేరే ఏం ఆలోచించకుండా మారిపోయాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్‌గా 'పరువు' ట్రైలర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement