తెలుగు సినిమాతోనే హీరోయిన్గా పరిచయమైన మలయాళ బ్యూటీ ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. పైలెట్ అవినాష్ సోమశేఖరన్తో కొత్త జీవితం మొదలుపెట్టింది. రీసెంట్గానే వీళ్లిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య దేవన్ తన ఇన్ స్టాలో పంచుకుంది. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)
కేరళకు చెందిన ఐశ్వర్య దేవన్.. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. 2011లో రిలీజైన 'కెరటం' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలు చేసింది. ధనుష్ అనేకుడు, పృథ్వీరాజ్ సుకుమారన్ 'సింహాసనం'లోనూ నటించి ఆకట్టుకుంది. చివరగా అయితే 2018లో వచ్చిన 'కాశీ ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా' అనే హిందీ మూవీలో కనిపించింది.
2017లో ‘ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర’ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య దేవన్.. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంది. వారం క్రితం కేరళకు చెందిన పైలెట్ అవినాష్ సోమశేఖరన్ని పెళ్లాడి కొత్త జీవితం మొదలుపెట్టింది.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)




