ముగిసిన కబడ్డీ అకాడమీ ప్రవేశాల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కబడ్డీ అకాడమీ ప్రవేశాల ఎంపికలు

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాలమూరు నగరం మెయిన్‌ స్టేడియంలోని బాలుర కబడ్డీ అకాడమీలో ప్రవేశాల ఎంపికలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. అకాడమీలో 20 మంది క్రీడాకారుల కోసం 40 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేశామని, వీరిలో 20 మందిని అకాడమీకి ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులకు శాట్‌జీ ప్రధాన కార్యాలయం నుంచి సెలక్షన్‌ లేఖలు, ఫోన్‌ ద్వారా సమాచారం అందజేయడం జరుగుతుందన్నారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులు వచ్చేనెల 1 నుంచి మహబూబ్‌నగర్‌ కబడ్డీ అకాడమీలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికై న వారు అలాగే సందేహాల నివృత్తి కోసం సెల్‌ నం.98660 80831ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్‌, శాట్‌జీ కబడ్డీ కోచ్‌ జ్యోతీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌, జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement