యువకుడిని కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

యువకుడిని కాపాడిన పోలీసులు

Sep 28 2024 2:10 AM | Updated on Sep 28 2024 2:10 AM

కృష్ణా: మండలంలోని ఖాన్‌దొడ్డికి చెందిన తారేష్‌ భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై శుక్రవారం తన పొలంలో పురుగుమందు తాగాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫోన్‌చేసి తెలుపడంతో స్పందించి వెంటనే సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని తారేష్‌ను మాగనూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతం అతడి అరోగ్యం నిలకడగా ఉందని వైద్యుడు తెలిపారు. తారేష్‌ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు రామ్‌తేజ, భరత్‌కు భార్య, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement