న్యూస్రీల్
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మన ఊరును మనమే కాపాడుకోవాలి
7
● ఎస్పీ శబరీష్
తొర్రూరు రూరల్: మన ఊరును మనమే కాపాడు కోవాలని ఎస్పీ శబరీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని చెర్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మహేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మన ఊరు–మన బాధ్యత కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పెద్దలందరూ ముందుకు వచ్చి సీసీ కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, డీఎస్పీ కృష్ణ కిశోర్, ఎస్సైలు ఉన్నారు.


