గర్భం ధరించి మొదలు పండంటి పాపాయిని ప్రసవించే దాకా ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు.
గర్భిణీలు తీసుకోనే ఆహారం, అపోహలపై ఈవిషయాలను తెలుసుకోవాలి.
- గర్భిణులు ఇద్దరి కోసం తినాలలా? నిజం ఏమిటంటే అవసరం లేదు. మోతాదు కంటే పోషక విలువలపై దృష్టి ముఖ్యం.
- బొప్పాయి, పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుంది? నిజమేనా? నిజం లేదు. బాగా పండిన బొప్పాయి, పైనాపిల్ తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితమే.
- కుంకుమపువ్వు తింటే బిడ్డ తెల్లగా పుడతారు. బిడ్డ చర్మం రంగు తల్లిదండ్రుల జీన్స్పైనే ఆధారపడి ఉంటుంది.
- చేపలు అస్సలు తినకూడదు. చేపలలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డ మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి.
- నెయ్యి ఎక్కువగా తింటే సుఖ ప్రసవం అవుతుంది : ఇందుకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు.
ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్


