శ్రీశైలంప్రాజెక్ట్: జూరాల నుంచి శ్రీశైలంకు వస్తున్న వరద ప్రవాహం ఆదివారం పడిపోయింది. గత కొద్ది రోజుల వరకు 2.11 లక్షల పైచిలుకు ఉన్న ఇన్ఫ్లో శనివారం 1.68 లక్షలకు పడిపోయింది. ఆదివారం జూరాల నుంచి కేవలం 44,279 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 60,177 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జునసాగర్కు 48,511 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,917 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 8,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,611 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.883 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 11.400 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 181.0590 టీఎంసిల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 878.60 అడుగులకు చేరుకుంది.


