ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
●‘న్యూవిజన్’ అత్యుత్తమం
ఖమ్మం సహకారనగర్: వైద్య విద్య(యూజీ)లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్’ ఫలితాలు గురువారం రాత్రి విడుదలయ్యాయి. ఇందులో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. జాతీయ స్థాయిలో జి.రీతిక 1,886వ ర్యాంక్, బి.శశాంక్ 2,791, కె.అరోణ్ నిహాల్ రాయ్ 3,173, జి.విష్ణువర్థన్ 3,235, జె.వివేక్నాయక్ 3,277, బి.సిద్ధు 3,286, కె.శ్రీహర్ష 4,836, బి.పవిత్ర 5,218, బి.జ్యోత్స్న 5,533, బి.ఉదయ్ రాజ్కుమార్ 6,250, బి.కేతన్ సాయివర్ధన్ 6526, బి.ప్రసన్నలక్ష్మి 7662, ఏ.విద్యశ్రీ 7,753, ఎల్.సంజీవ్ 8,411, టి.గోమతి 8,569, రోషిణి 9,847, జి.స్పందన 11,098, బి.ఉదయ్ భాస్కర్ 12,576, వి.సరిత 11,400, వి.సాయి కార్తీక్ 16,549, ఏ.లికిత్ కృష్ణ నాయక్ 17,162, జి.ప్రణీత్ 18,453, వి.తరణి 19,066వ ర్యాంక్ సాధించగా చైర్మన్, డైరెక్టర్లు సీహెచ్.కార్తీక్, డైరెక్టర్ సీహెచ్.గోపీచంద్, డీన్ శ్రీధర్ అభినందించారు.
●‘శ్రీ చైతన్య’ ప్రభంజనం
నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బి.సాయిశరణ్ 720 మార్కులకు 701 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 19వ ర్యాంక్, ఎన్.సంధ్య 611 మార్కులతో 2,662వ ర్యాంక్ సాధించిందని తెలిపారు. వివిధ కేటగిరీల్లో బి.సాయిశరణ్ 5వ ర్యాంక్, డి.డిస్నీకృతిక 255, బి.సబిత 3,456, బి.మాన్య శ్రీ 3,491, బి.నిఖిత 3,737, ఎం.ఉదయ్ 3,942, జి.జశ్వంత శివసాయి 4,666, బి.శివసాయి 5,683, ఎం.మానస 5,862, డి.స్పందన 6,421, జి.హేమ శ్రీ 7,141, జి.ఘనిత 7,505, ఏ.తరుణ్ 7,890, జె.భాగ్యరాజ్ 8,162, వి.లక్ష్మీసుమ 8,342వ ర్యాంక్ సాధించారన్నారు. కార్యక్రమంలో ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, జి.గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
●‘హార్వెస్ట్’ ముందంజ
నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో పి.యామిని 484మార్కులతో 55,379వ ర్యాంక్, బానోతు లక్ష్మిత 1,732వ ర్యాంక్, ఎం.రాహుల్ 3,176, జర్పుల పూజిత 3,507, ఏ.అన్విదారెడ్డి 29,175, సిమ్రాన్ కౌనైన్ 31,147, పి.భవిత 11,108తో పాటు బానోతు పార్థవి, కె.హర్షిత, ఈ.ఉదయ్కిరణ్, ఏ.అన్విదా రెడ్డి, సిమ్రాన్ కౌనైన్, పి.భవిత మెరుగైన ర్యాంకులు సాదించారని పేర్కొన్నారు.
●‘రెజొనెన్స్’ విజయభేరి
నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్.వీ. నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. జాతీయ స్థాయిలో వి.శిరీష 459, ఎ.ంపద్మవచన్ 411, కె.హారికారెడ్డి 390, ఐ.హరికృష్ణ 366, కె.జాహ్నవి 362, ఎన్.శైలు 350, టి.సిరిలహరి 343, ఎన్.జాహ్నవి 338వ ర్యాంక్లు సాధించారని తెలిపారు. ఇంకా మరికొందరు ఉత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీష్, ఎం.భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
●‘సర్వజ్ఞ’ సక్సెస్
నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సర్వజ్ఞ విద్యాసంస్థల చైర్మన్ ఆర్.వీ.నాగేంద్రకుమార్ తెలిపారు. ఎం.లక్ష్మీదేవి 8,355వ ర్యాంక్, బి.మెర్సీ 8,757, కె.సింధు 9,833, ఏ.తన్విత్ 14,118, కె.మైథిలి 37,508 ర్యాంకులు సాధించగా చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ జనార్దన్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.


