
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభకు లక్షలాదిగా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. వీరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరుతుండటంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలానికి చెందిన పలు వురు వైఎస్సార్, పొంగులేటి చిత్రాలతోపాటు జై జగన్ అనే నినాదం రాసి ఉన్న జెండాలను పట్టుకుని సందడి చేశారు.