రాయచూరు రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్లో ఉదయం చపాతి తిన్న 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాయచూరు జిల్లాలో సంభవించింది. మంగళవారం సింధనూరు నగర పోలీస్ స్టేషన్ వద్ద హాస్టల్లో టిఫిన్ చేసిన విద్యార్థులు అతిసార, విరేచనాల బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం సర్కార్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రిన్సిపాల్, వార్డెన్ల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. పది రోజుల్లో ఇలా రెండో సారి జరగడంపై నాడగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
16 మంది విద్యార్థులకు అస్వస్థత
సింధనూరు ఆస్పత్రిలో చికిత్స
రాయచూరు జిల్లాలో ఘటన


