అధికారం కాదు, చేసిన మంచే శాశ్వతం | - | Sakshi
Sakshi News home page

అధికారం కాదు, చేసిన మంచే శాశ్వతం

Published Wed, Mar 19 2025 1:49 AM | Last Updated on Wed, Mar 19 2025 1:47 AM

హొసపేటె: పట్టణంలోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ థియేటర్‌లో సన్యాసి సేవాలాల్‌ స్వామీజీ 286వ పరమపూజ్య సర్దార్‌ సేవాలాల్‌ స్వామీజీ, శివప్రకాష్‌ మహారాజ్‌ స్వామీజీ, తిప్పేస్వామి మహారాజ్‌ స్వామీజీల సమక్షంలో జరిగిన సేవాలాల్‌ జయంతిని ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌టీ శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాలూకా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం అని, చేసిన మంచే శాశ్వతంగా మిగిలిపోతుందని అన్నారు. తాలూకాలోని బంజారా సమాజంలోని పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదని ప్రభుత్వం బండెబసాపుర తండా, అప్పేనహళ్లి తండాల్లో నిర్మించతలపెట్టిన హైస్కూల్‌, హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మౌలిక సదుపాయాల కొరత గురించి తెలుసుకున్నాను. త్వరలో సొసైటీకి కమ్యూనిటీ హాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి బీ.శ్రీరాములు, పార్టీ నేతలు కుడిచి రాజీవ్‌, అనంతనాయక్‌, పీఏపీఎం అధ్యక్షుడు కావలి శివప్ప నాయక, డీఎస్పీ మల్లేశప్ప దొడ్డమని, ఎన్‌టీ తమ్మణ్ణ, ఎం.వాసుదేవనాయుడు, శ్రీకంఠపుర వెంకటేష్‌ నాయక్‌, శిరహట్టి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement