ప్రియుడి సహకారంతో భర్త హత్య.. బైక్‌ రిపేరీ అని పిలిపించి.. | - | Sakshi
Sakshi News home page

ప్రియుడి సహకారంతో భర్త హత్య.. బైక్‌ రిపేరీ అని పిలిపించి..

May 20 2023 12:16 AM | Updated on May 20 2023 10:14 AM

- - Sakshi

సాక్షి, కృష్ణరాజపురం, కర్ణాటక: ప్రియుడి సహకారంతో భర్తను హత్య చేసిన ఘటన నగరంలోని మహాదేవపుర కాడుగోడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... ఉదయ్‌ కుమార్‌ (40), ప్రియా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదిలా ఉంటే వీరు ఉంటున్న ఇంటి పక్కనే అన్వర్‌ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉదయ్‌ నిత్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండేవాడు. తన బాధలు అన్ని ప్రియా అన్వర్‌కు చెప్పుకునేది. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అన్వర్‌ ఆమైపె ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె ససేమిరా అనేది.

బైక్‌ రిపేరీ అని పిలిపించి హత్య
బైక్‌ మెకానిక్‌ అయిన ఉదయ్‌ కుమార్‌ గురువారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య, పక్కింటి అన్వర్‌కు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతని అడ్డు తొల గించుకోవడానికి అన్వర్‌ పథకం వేశాడు. బెక్‌ రిపేరీ ఉందని ఉదయ్‌కు అన్వర్‌ ఫోన్‌ చేశాడు. కాడుగోడి శివాలయం వద్ద ఉన్నట్లు మెసేజ్‌ చేశాడు. దీంతో ఉదయ్‌ రాత్రి సమయమైన అక్కడికి చేరుకున్నాడు. ఉదయ్‌ అక్కడికి రాగానే అన్వర్‌.. భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ నిలదీశాడు. సంబంధం లేని విషయంలో నీ జోక్యం ఎందుకు అంటూ ఉదయ్‌ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో అన్వర్‌ తన వద్ద ఉన్న కత్తితో ఉదయ్‌ను పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి అన్వర్‌ను అరెస్ట్‌ చేసి ఉదయ్‌కుమార్‌ భార్యను కూడా విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement