దుబాయ్‌లో సాయంపేటవాసి మృతి | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో సాయంపేటవాసి మృతి

Aug 20 2024 12:08 AM | Updated on Aug 20 2024 10:27 AM

దుబాయ్‌లో సాయంపేటవాసి మృతి

దుబాయ్‌లో సాయంపేటవాసి మృతి

మృతదేహాన్ని స్వగ్రామం పంపించాలని కోరిన విప్‌ ‘అడ్లూరి’

సీఎస్‌ ద్వారా ఇండియన్‌ ఎంబసీకి లేఖ

ధర్మారం(ధర్మపురి): మండలంలోని సాయంపేట గ్రామానికి చెందిన ఆవుల ఓదెలు(35) దుబాయ్‌లో చనిపోయాడు. అతని మృతదేహాన్ని స్వగ్రా మం పంపించాలని కోరుతూ ప్రభుత్వ విప్‌, ఎమ్మె ల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సిఫారసు మేరకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి దుబాయ్‌లోని ఇండియన్‌ ఎంబసీకి లేఖ రాశారు. బాధిత కుటుంబసభ్యుల వి వరాల ప్రకారం.. ఓదెలు జీవనోపాధి కోసం దు బాయ్‌ వెళ్లాడు.

 వారం రోజుల క్రితం అక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రా మం పంపించేందుకు అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ విప్‌ లక్ష్మ ణ్‌కుమార్‌ను కలిసి, విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఇండియన్‌ ఎంబసీకి లేఖ పంపించారు. ఓదెలు మృతదేహం త్వరగా ఇండియాకు వచ్చేలా చూడాలని అందులో కోరారు. మృతుడికి భార్య, ఒక పాప ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement