Man Attacked On Women With Knife For Not Agreeing To An Extra-Marital Affair In Kamareddy - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: భర్తను వదిలి రమ్మంటే రాలేదని..

Aug 7 2023 12:48 AM | Updated on Aug 7 2023 3:11 PM

- - Sakshi

స్వాతికి నీలేష్‌ అనే వ్యక్తితో గతంలో వివాహేతర సంబంధం ఉండేది.

కామారెడ్డి: వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని మహిళపై నీలేష్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం నిజామాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. రెండో టౌన్‌ ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాలు.. నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన స్వాతి, భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. స్వాతికి నీలేష్‌ అనే వ్యక్తితో గతంలో వివాహేతర సంబంధం ఉండేది.

వారి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. స్వాతిని భర్తను వదిలి తన వద్దకు రావాలని తరుచూ వేధించేవాడు. దీనికి మహిళ ఒప్పుకోకపోవడంతో, ఆదివారం ఉదయం కసాబ్‌గల్లీలో ఒంటరిగా ఉన్న స్వాతిపై, నీలేష్‌ కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో నాలుగు పోట్లు పొడిచాడు. స్థానికులు అక్కడికి చేరుకోగానే నీలేష్‌ పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిలేష్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందినవాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement