వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల విగ్రహాలను ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


