మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు : డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన మహిళా కమిషన్‌ | Telangana women commission reaction on women journalists complaint against online abuse | Sakshi
Sakshi News home page

మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు : డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన మహిళా కమిషన్‌

Nov 20 2025 5:35 PM | Updated on Nov 20 2025 5:56 PM

Telangana women commission reaction on women journalists complaint against online abuse

మహిళలపై ఆన్‌లైన్‌ దాడులు చేస్తే తప్పించుకోలేరు : మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ వేధింపులు, బెదిరింపులపై మహిళా జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా కమిషన్‌ స్పందించింది. తక్షణమే డీటైల్డ్ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని తెలంగాణ DGPకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు  తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కమిషన్‌ చైర్ పర్సన్ నేరెళ్ల శారద  తక్షణమే స్పందించిన తీరుపై  మహిళా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. 

మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛాయుత అభిప్రాయ వ్యక్తీకరణను కాపాడటం తమ ప్రాధాన్యత అని నేరెళ్ల శారద స్పష్టం చేశానేజ.మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్ హరాస్‌మెంట్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై సమన్స్ జారీ చేశామన్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి కఠిన చర్యలు తీసుకుంటుంది ఆమె వెల్లడించారు.  మహిళలపై ఇలాంటి దాడులు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదని కూడా  ఆమె హెచ్చరించారు.  కాగాఆన్ లైన్ వేదింపులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నవంబర్ 18న హైదరాబాద్‌ మహిళా జర్నలిస్టు బృందం మహిళాకమిషన్‌కు  ఫిర్యాదు చేసింది. 

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ వేధింపులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement