-
HYD: ‘గుంటూరు పోకిరి’ గణేష్పై పీడీ యాక్ట్
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియాలో యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ఓ యువకుడిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. గుంటూరుకు చెందిన లక్ష్మీ గణేష్ ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమ్మాయిలతో ఛాటింగ్ చేసేవాడు. హ్యాకింగ్ స్కాం , ఇంటర్ ది డ్రాగన్ , కింగ్ ఈజ్ బ్యాక్ , తేజ రౌడీ పేరు తో గ్రూప్లు, ఐడీలు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో వాళ్ల ఫోన్ నెంబర్లు సైతం సంపాదించి వేధించడం చేయడం ప్రారంభించాడు. అసభ్యకరమైన మెసేజ్లు, ఫొటోలు, ఎమోజీలు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన లక్ష్మీ గణేష్.. పోకిరిగా, జులాయిగా తిరుగుతూ వస్తున్నాడు. చాలాకాలంగా ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఓ యువతి ఘట్కేసర్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయగా.. జైలులో ఉన్నాడు. తిరిగి విడుదల అయ్యాక కూడా అదే పని చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మరో మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. పీడీ యాక్ట్ విధించి కటకటాల వెనక్కి నెట్టారు రాచకొండ పోలీసులు. -
రెండేళ్లుగా అమృతపై అసభ్యకరమైన కామెంట్లు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వస్తున్న ఓ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఆమె ఈ పని చేస్తూ వస్తోంది. చివరకు సైబర్ పోలీసుల జోక్యంతో ఆమె కటకటాల వెనక్కి వెళ్లింది. అమృత ఫడ్నవిస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్నది తెలిసిందే. అయితే.. స్మృతి పాంచోల్ అనే మహిళ గత రెండేళ్లుగా రకరకాల అకౌంట్లతో అమృత ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్లలో అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్లు చేస్తూ వస్తోంది. సుమారు 50 ఏళ్ల వయసున్న నిందితురాలు.. గత రెండేళ్లలో ఆమె 53 ఫేక్ ఎఫ్బీ ఐడీలు, 13 జీమెయిల్ అకౌంట్లు వాడినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఐపీసీ 419, 468 సెక్షన్ల ప్రకారం, అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం ఆమెపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం నిందితురాలు కోర్టు రిమాండ్లో ఉండగా.. అసలు ఆమె అలా చేయడానికి కారణాలేంటి? ఆమె వెనుక ఎవరున్నారనే విషయాలను తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదీ చదవండి: స్నేక్మ్యాన్ వినోద్.. పాపం కళ్ల ముందే కుప్పకూలాడు -
నీకు అవకాశాలు రావాలంటే ఈ పాడు పనులు తప్పవులే అంటూ
కోల్కతా: ‘‘ఆ దర్శకుడితో డేటింగ్లో ఉన్నందుకే నీకు ఆఫర్లు వస్తున్నాయి. లేదంటే నువ్వు ‘కమిట్మెంట్’ ఇస్తేనే తప్ప నిన్ను ఎవరు సీరియల్లో పెట్టుకుంటారు. నీలాంటి మేని ఛాయ ఉన్నవాళ్లకు అవకాశాలు రావాలంటే అలాంటి పాడు పనులు తప్పవులే’’... బెంగాలీ నటి శృతిదాస్పై కొంతమంది నెటిజన్ల విద్వేషపు కామెంట్లు ఇవి. ప్రస్తుతం ఆమె.. ‘దశేర్ మాతీ’ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో శృతితో పాటు పాయల్ దే, రుక్మా రే అనే మరో ఇద్దరు నటీమణులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మేని ఛాయతో శృతి స్కిన్ కలర్ను పోలుస్తూ ఈ విధంగా ట్రోల్స్ రెచ్చిపోతున్నారు. గత రెండేళ్లుగా ఆమెపై విద్వేష విషం కక్కుతూనే ఉన్నారు. దీంతో విసిగిపోయిన శృతి... ఆన్లైన్లో తనకు వస్తున్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ‘‘బ్లాక్ బోర్డు, నలుపు అమ్మాయి.. ఇలాంటి పేర్లతో నన్ను వేధించడం కొంతమందికి పనిగా మారింది. అసలు నీలాంటి వారిని హీరోయిన్లుగా ఎలా పెట్టుకుంటారంటూ కించపరుస్తున్నారు. అంతేకాదు లీడ్రోల్స్ కోసం నేను దర్శకులతో ‘రాజీ’ కుదుర్చుకుంటున్నానని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మరికొంత మందేమో... స్వర్నేందు(బెంగాలీ సీరియల్ డైరెక్టర్)తో రిలేషన్షిప్లో ఉన్నందు వల్లే ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. కానీ అవన్నీ నిజం కావు. నా ప్రతిభే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎవరో రికమెండ్ చేస్తేనో, లేదంటే ‘మరో’ విధంగానో నేను అవకాశాలు దక్కించుకోవడం లేదు. ప్రేక్షకులు ఆదరించకపోతే.. ఎవరూ ఏం చేయలేరు. నా కారణంగా నష్టపోవడానికి సిద్ధపడరు. గత రెండేళ్లుగా నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే నిన్ననే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా త్రినయని సీరియల్తో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి దాస్.. ప్రస్తుతం దశర్ మాతీ సీరియల్లో.. టీచర్గా నటిస్తున్నారు. -
హద్దు దాటి కామెంట్ చేస్తే కటకటాలే..
ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ చేసి కొత్తగూడకు చెందిన సర్పంచ్ అరెస్టు అయ్యారు. అలాగే గతంలోనూ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియనాయక్పై సోషల్ మీడియా వేదికగా అభ్యంతర కర వాఖ్యలు చేసి పలువురు అరెస్టయ్యారు. రాజకీయ నేతలతో పాటు, సాధారణ ప్రజానీకంలోని మహిళలు, ఇతర వ్యక్తుల పట్ల అనుచిత ప్రవర్తన చేసి కేసులపాలైన వారు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నారు. చేతిలో మొబైల్ ఉందని హద్దుమీరితే శిక్షల నుంచి తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, మహబూబాబాద్: నేడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో ప్రధాన భాగమైన ఫేస్బుక్, వాట్సప్ లాంటి యాప్లు ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు. దీంతో ఇందులో రాజకీయ నేతలతో పాటు, సామాన్య ప్రజానీకం భాగస్వాములై తమ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసుకొని తమకు సంబంధించిన ఆంశాలను ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే జిల్లాలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించ పరుస్తూ, అసభ్యకరమైన పోస్టింగ్లతో కేసులపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమ ని ఎవరూ చూడటం లేదని హద్దుమీరి పోస్టింగ్లు, కామెంట్లతో రెచ్చిపోతున్న వారి సంఖ్య అధికమవుతుంది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న వారిలో కొద్ది మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరి కొందరు ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక, మరికొందరు అందరికీ తెలిస్తే పరువుపోతుందని ఫిర్యాదు చేయకుండా ఉంటున్నారు. కామెంట్లు.. కౌంటర్లు సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో, దాదాపు అన్ని పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగాలను పార్టీ నాయకులే కాకుండా, పార్టీ కార్యకర్తలు తమ గ్రామాల్లో వివిధ పేర్లతో వాట్సప్ గ్రూప్స్, ఫేస్బుక్లలో పేజీలు క్రియేట్ చేసుకుంటున్నారు. గతంలో ఆయా పార్టీల నేతలు సభలు, సమావేశాల్లో నేరుగా ప్రత్యర్థుల పై విమర్శలు, ఆరోపణలు చేసేవారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నం చేసేవారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలోనే కాకుండా, మామూలు సమయంలో సైతం తమ పార్టీ నిర్ణయాలను, తమ నాయకుడు చేసిన పనులు, వాగ్దానాలు ఇతర ఆంశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీల నేతలు పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఆయా పార్టీల ఫాలోవర్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కామెంట్లు, కౌంటర్లు పెడుతూ.. తమ పార్టీ నేతల గుణగణాలు, ఎదుటివాళ్ల లోపాలనూ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఐదేళ్ల కిందట ఇలా ఉండేది.. ఇప్పుడు ఇదిగో ఇలా మార్చాం. ఈ ఘనత మా నేతదే.. ఇలాంటివి ఎన్నో చేశాం.. ఇక ముందు మరెన్నో చేస్తాం.. ఇప్పటికైనా అభివృద్ధికి చేయాతనివ్వండి.. అంటూ పోస్టులతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత పార్టీ అనుచరులు జయహో.. అంటుంటే, ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేక కామెంట్లు విసురుతున్నారు. ఇవి కొన్ని సందర్భాల్లో కట్టు తప్పి, వ్యక్తిగత విమర్శలకు దారితీస్తూ అదుపుతప్పుతున్నాయి. అదుపు తప్పుతున్నాయ్.. విమర్శలకైనా.. ఆరోపణలకైనా.. ఒక హద్దు ఉంటుంది. ప్రత్యర్థిపై దాడి చేసే ముందు సంబంధిత అంశానికి సంబంధించిన ఆధారం కూడా ఉండాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చాలా మంది ఇష్టానుసారంగా కామెంట్లు, కౌంటర్లు, షేర్లు చేస్తున్నారు. ఇది కాస్తా విషమంగా మారుతుంది. మునిసిపాలిటీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో సోషల్ మీడియాలో మరింత రచ్చ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటి పై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని, వారికి చట్ట ప్రకారం శిక్షలను అనుభవించాల్సి ఉంటుదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టాలతో... ఒకరి హక్కులకు భంగం కలిగించేలా ఇంటర్నెట్లో ప్రచారం చేస్తే బాధ్యుల పై ఐటీ చట్టం 66సీ, 66డీ, 67 కింద కేసులు నమోదు చేస్తారు. మహిళల పై వేధింపులకు దిగితే ఐపీసీ 509(మహిళల గౌరవానికి భంగం కలిగించడం), 354(ఏ,బీ,సీ,డీ) నిర్భయ చట్టాల కింద కటకటాల్లోకి పంపుతారు. అలాగే ఐపీసీ 292, 294 చట్టాల కింద కేసులు తప్పవు. కటకటాల పాలైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చిక్కులు తప్పవు. కార్పొరేట్, స్టాప్వేర్ లాంటి పెద్ద కంపెనీల కొలువుల్లోనూ ప్రవర్తన పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అక్కడా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. జాగ్రత్తగా ఉండాలి సామాజిక మాద్యమాల ద్వారా అభ్యంతరకరమైన, మనోభావాలను దెబ్బతీసేలా, శాంతికి విఘాతం కలిగించేలా ఉన్న పోస్టులు చేయొద్దు. అలాగే వాటిని షేర్ చేయడం, కామెంట్ చేయవద్దు. ఇలాంటి వాటి పై దృష్టి పెట్టాం. అలాగే ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. హద్దు మీరితే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలు పాటించి అందరూ ఉపయోగపడేవి షేర్ చేయాలి. –నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ -
సైబర్ కీచకుల ఆటకట్టు
ఫేస్బుక్లో సరదాగా పోస్టు చేసిన ఫ్యామిలీ ఫొటోలోని ఆమె ముఖాన్ని కాపీ చేసి అసభ్య చిత్రాలకు జత (మార్ఫింగ్) చేశాడు ఒక సైబర్ కీచకుడు. తాను చెప్పినట్టు చేయకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని విశాఖకు చెందిన ఓ యువతిపై వేధింపులకు దిగాడు. మీరు అందంగా ఉంటారు. మిమ్మల్ని కలవాలనుంది అంటూ వాట్సాప్ చాటింగ్ ద్వారా గుంటూరుకు చెందిన ఓ వివాహితపై అసభ్య పదజాలంతో మరో పోకిరీ ఆగడాలు.. .. ఇలా రాష్ట్రంలో మహిళలే లక్ష్యంగా ‘సైబర్’ కీచకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇలాంటి వారి పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో ‘సైబర్ మిత్ర’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. మహిళలు, బాలికల ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపడంతోపాటు ‘సైబర్’ కీచకుల ఆటకట్టించే చర్యలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ‘సైబర్మిత్ర’ పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీనిపై మహిళలు, చిన్నారుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెలగపూడి, విశాఖపట్నం, విజయవాడలో ఈ సదస్సులు జరిగాయి. –సాక్షి, అమరావతి మూడేళ్లలో కేసులు రెట్టింపు సామాజిక మాధ్యమాల కారణంగా మహిళలు చైతన్యంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పోలీసు రికార్డులకెక్కుతున్న సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. 2016లో మహిళలపై వేధింపులకు సంబంధించి 160 సైబర్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు 291 నమోదయ్యాయి. ఇలా వేధింపులకు గురవుతున్న వారిలో 70 శాతం మంది 20 ఏళ్లలోపు యువతులే కావడం గమనార్హం. కాగా, ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఓ వాట్సప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్లకుండానే ఈ నెంబర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చెయ్యొచ్చు. ఇలా ఫిర్యాదు చేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు కూడా. ఇవీ జాగ్రత్తలు.. - అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు, వాట్సాప్ చాటింగ్లకు స్పందించకుండా ఉంటే మేలు. - ఫోన్లకు సోషల్ మీడియా ద్వారా అపరిచితులు పంపే లింకులను ఓపెన్ చేయకూడదు. దీనివల్ల మన ఫోన్ను హ్యాక్చేసి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు చోరీచేసే ప్రమాదం ఉంది. - యాప్లు గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకూడదు. - సామాజిక మాధ్యమాల్లో మహిళలు, యువతులు ఫొటోలు అప్లోడ్ చేయకపోవడం మంచిది. - అపరిచితులకు ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను షేర్ చేయకూడదు. అప్రమత్తతే మహిళలకు ప్రాథమిక రక్షణ సామాజిక మాధ్యమాల పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలి. ఫొటోలు షేర్ చేయడం, పోస్టు చేయడం వంటి విషయాల్లో సాంకేతిక భద్రత అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అవే ఫొటోలను సైబర్ నేరగాళ్లు తీసుకుని అశ్లీల ఫొటోలతో మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడొచ్చు. బాధితులు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం.. విశాఖపట్నం, విజయవాడలలో ఉన్న సైబర్ పోలీస్స్టేషన్లతోపాటు, ఇతర పోలీస్స్టేషన్లు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. – మేరీ ప్రశాంతి, ఎస్పీ, సైబర్ మిత్ర వింగ్ ఇంట్లో నుంచే ఫిర్యాదు చెయ్యొచ్చు ఆన్లైన్ వేధింపులకు పాల్పడే సైబర్ నేరగాళ్లపై బాధిత మహిళలు పోలీసు స్టేషన్కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే వాట్సాప్ నెంబర్ 9121211100 ఫిర్యాదు చెయ్యొచ్చు. ఈ నెంబర్కు రోజుకు సగటున 23–27 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాట్సాప్, ఈ–మెయిల్, ఇంటర్నెట్, తదితర అన్ని ఆన్లైన్ వేధింపులపైన ఐటీ యాక్ట్–2000 ప్రకారం, ఐపీసీ సెక్షన్లపై కేసులు నమోదు చేస్తున్నాం. – కేజీవీ సరిత, ఏఎస్పీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement