వెలమలపల్లి పాఠశాల రీఓపెన్‌ | - | Sakshi
Sakshi News home page

వెలమలపల్లి పాఠశాల రీఓపెన్‌

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

మల్హర్‌: మండలంలోని తాడిచర్ల వెలమలపల్లిలో గతంలో మూతపడిన ప్రాథమిక పాఠశాలను గురువారం డీఈఓ రాజేందర్‌ రీఓపెన్‌ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలను విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మూతపడిన పాఠశాలను తిరిగి తెరవడంతో గ్రామంలోని చిన్నారులకు విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యార్థులు దూరం వెళ్లే అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బండి స్వామి, ఎంఈఓ లక్ష్మణ్‌బాబు, తాడిచర్ల జెడ్పీహెచ్‌ఎస్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ం తిరుపతిరెడ్డి, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, కుమారస్వామి, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పద్మ, గంగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement