కొత్తపల్లి(కరీంనగర్): నీట్–2026 ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. కరీంనగర్లోని అల్ఫోర్స్ వావిలాలపల్లి ఆద్య భవన్లో విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి అభినందించారు. డి.రిత్విక్ 647 మార్కులతో అత్యున్నతస్థానంలో నిలువగా, సిద్దాంత్ చతుర్వేది 564, సయ్యద్ మలాజుద్దీన్ 557, వసుల శ్రుత్విక 551, గులామ్ మొహమ్మద్ హుస్సేన్ 548, బత్తుల అభిజ్ఞ 541, లింగంపల్లి అనంత్ సాయి 540, నార్ల శ్రీహిత 538, శ్రేయాంశ్ ద్వివేది 537, కొండ్ల అక్షిత 522, బొమ్మవరపు రుత్విక్ 515, జక్కుల శ్రీవైత్రి 512, టి.హర్షిత 509, సిద్ధం సాత్విక 508, ఎ.సత్య బ్రాహ్మిణి 507, బి.అక్షర 505, నిద 502, గుంజేటి రిషిత 501, జహ్రా మాజీద్ 501 మార్కులు సాధించారు. 19 మంది విద్యార్థులు 500, ఆపై మార్కులు సాధించడమే కాకుండా సుమారుగా 100 మంది వివిధ ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలలలో సీట్లు సాధించగలరని తెలిపారు.


