దైవ దర్శనానికి వెళ్తూ.. బావ, బావమరుదులు మృత్యు ఒడికి | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్తూ.. బావ, బావమరుదులు మృత్యు ఒడికి

Dec 17 2023 10:30 AM | Updated on Dec 17 2023 12:58 PM

- - Sakshi

ఆకాశ్‌, శ్రావణ్‌ (ఫైల్‌)

జగిత్యాల: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృత్యు ఒడికి చేరారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని టేకుమడ్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన బొల్లకొండ ఆకాశ్‌(22), ఏంపేడు గ్రామానికి చెందిన మాడగోడి శ్రావణ్‌(30) బావ, బావమరిది. ఈ ఇద్దరు, ఆకాశ్‌ స్నేహితుడు రాకేశ్‌ శుక్రవారం అర్ధరాత్రి దాటాక కారులో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి బయలుదేరారు.

శంకరపట్నం మండలంలోని తాడికల్‌ శివారులోకి రాగానే ఎదురుగా కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆకాశ్‌, శ్రావణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. రాకేశ్‌కు తీవ్ర గాయాలవడంతో స్థానికులు 108 వాహనంలో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై లక్ష్మారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని, పరిశీలించారు. ఆకాశ్‌ తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇవి కూడా చ‌ద‌వండి: ఏకంగా మూడు పెళ్లిల్లు! చివ‌రికి అత్త‌మామ‌ల‌ను దారుణంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement