ఆ దేశాన్ని వీడుతున్న ప్రజలు!.. కారణం ఏంటంటే? | Tuvalu: More Than Third Of Country Population Has Applied To Relocate | Sakshi
Sakshi News home page

ఆ దేశాన్ని వీడుతున్న ప్రజలు!.. కారణం ఏంటంటే?

Jun 30 2025 7:34 PM | Updated on Jun 30 2025 9:06 PM

Tuvalu: More Than Third Of Country Population Has Applied To Relocate

యుద్ధాలు, అంతర్యుద్ధాలు కొన్ని దేశాల ప్రజలను శరణార్థులుగా మారుస్తుంటే.. వాతావరణంలో మార్పులు ఒక దేశ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అ దేశం పేరు తువాలు. హవాయి, ఆ్రస్టేలియా మధ్యలో పసిఫిక్‌ మహాసముద్రంలో తొమ్మిది చిన్న పగడపు దీవులతో కూడిన అతి చిన్న దేశం. ఇక్కడి జనాభాలో మూడింట ఒక వంతుకు పైగా ఆ్రస్టేలియాకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ప్రజలు దేశాన్ని వీడటానికి కారణమేంటి? వాతావరణం ఆ దేశానికి ముప్పుగా ఎలా మారింది? ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది చూద్దాం. 

తువాలు.. ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఇక్కడి జనాభా 10,000 మంది కంటే తక్కువ. అంటే మన దేశంలో చిన్న పట్టణంతో సమానం. 1978లో బ్రిటిష్‌ పాలకుల నుంచి నుంచి స్వాతంత్య్రం పొందింది. సహజమైన సౌందర్యానికి నెలవు. స్కూబా డైవింగ్‌కు ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇక ఈ దేశంలో అతి పెద్ద దీవి.. పగడపు దీవి అయిన ఫనాఫుటి. ఇది దేశ రాజధాని కూడా.

దీనికి కొన్ని ప్రదేశాల్లో కేవలం 65 అడుగుల వెడల్పు ఉన్న రన్‌వే లాంటి భూమి ఉంది. వాతావరణంలో మార్పులు ఈ దేశానికి ముప్పుగా పరిణమించాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఆ్రస్టేలియాకు వలసపోతారు. వీరికి నివాసం కల్పించడం కోసం మానవతా దృక్పథంతో ఆ్రస్టేలియా ల్యాండ్‌మార్క్‌ వీసా పథకాన్ని రూపొందించింది. ఈ నెల 16న దరఖాస్తుల విండోను ప్రారంభించింది.

ఇప్పటివరకు 4,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి జనవరి 2026 వరకు 280 మందిని ఎంపిక చేయనుంది. ఈ వీసాలను గెలుచుకున్న వారు.. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందుతారు. విద్య, ప్రజారోగ్యంతోపాటు పనిచేసే హక్కు కూడా వారికి లభిస్తుంది. 2050 నాటికి తువాలులో సగానికి పైగా భూమి మునిగిపోతుందని, ఇక  2100 నాటికి 90శాతం దేశం సముద్రంలో కలిసిపోతుందని తువాలు ప్రధాన మంత్రి ఫెలేటి టియో తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎవరూ అక్కడ నివసించలేకపోయినా, తువాలుకు గుర్తింపు ఇస్తామని ఆస్ట్రేలి యా హామీ ఇచ్చింది 
    –  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement