breaking news
Tuvalu
-
ఆ దేశాన్ని వీడుతున్న ప్రజలు!.. కారణం ఏంటంటే?
యుద్ధాలు, అంతర్యుద్ధాలు కొన్ని దేశాల ప్రజలను శరణార్థులుగా మారుస్తుంటే.. వాతావరణంలో మార్పులు ఒక దేశ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అ దేశం పేరు తువాలు. హవాయి, ఆ్రస్టేలియా మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో తొమ్మిది చిన్న పగడపు దీవులతో కూడిన అతి చిన్న దేశం. ఇక్కడి జనాభాలో మూడింట ఒక వంతుకు పైగా ఆ్రస్టేలియాకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ప్రజలు దేశాన్ని వీడటానికి కారణమేంటి? వాతావరణం ఆ దేశానికి ముప్పుగా ఎలా మారింది? ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది చూద్దాం. తువాలు.. ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఇక్కడి జనాభా 10,000 మంది కంటే తక్కువ. అంటే మన దేశంలో చిన్న పట్టణంతో సమానం. 1978లో బ్రిటిష్ పాలకుల నుంచి నుంచి స్వాతంత్య్రం పొందింది. సహజమైన సౌందర్యానికి నెలవు. స్కూబా డైవింగ్కు ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇక ఈ దేశంలో అతి పెద్ద దీవి.. పగడపు దీవి అయిన ఫనాఫుటి. ఇది దేశ రాజధాని కూడా.దీనికి కొన్ని ప్రదేశాల్లో కేవలం 65 అడుగుల వెడల్పు ఉన్న రన్వే లాంటి భూమి ఉంది. వాతావరణంలో మార్పులు ఈ దేశానికి ముప్పుగా పరిణమించాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఆ్రస్టేలియాకు వలసపోతారు. వీరికి నివాసం కల్పించడం కోసం మానవతా దృక్పథంతో ఆ్రస్టేలియా ల్యాండ్మార్క్ వీసా పథకాన్ని రూపొందించింది. ఈ నెల 16న దరఖాస్తుల విండోను ప్రారంభించింది.ఇప్పటివరకు 4,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి జనవరి 2026 వరకు 280 మందిని ఎంపిక చేయనుంది. ఈ వీసాలను గెలుచుకున్న వారు.. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందుతారు. విద్య, ప్రజారోగ్యంతోపాటు పనిచేసే హక్కు కూడా వారికి లభిస్తుంది. 2050 నాటికి తువాలులో సగానికి పైగా భూమి మునిగిపోతుందని, ఇక 2100 నాటికి 90శాతం దేశం సముద్రంలో కలిసిపోతుందని తువాలు ప్రధాన మంత్రి ఫెలేటి టియో తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎవరూ అక్కడ నివసించలేకపోయినా, తువాలుకు గుర్తింపు ఇస్తామని ఆస్ట్రేలి యా హామీ ఇచ్చింది – -
ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!
మరో యాభై ఏళ్లలో ఆ దేశం ఉనికిలో ఉండకపోవచ్చు. పూర్తిగా సముద్రంలో మునిగిపోవచ్చు. ఇప్పటికే ఆ దేశం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. ఆ దేశం ఏమిటి? ఎక్కడుంది అనుకుంటన్నారా? ఫిజీకి ఉత్తరాన వెయ్యి కిలోమీటర్ల దరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ న్న ద్వీపదేశం పేరు ‘తువాలు’. దీని విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు, జనాభా 11,900. ఈ దేశానికి ఒక విమానాశ్రయం ఉంది. వారానికి మూడు విమానాలు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతాయి. విమానాల రాకపోకలు లేని సమయంలో పిల్లలు రన్వే మీద ఆటలాడుకుంటూ కనిపిస్తారు. ఈ దేశం పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది. తువాలును ఏటా సందర్శించే పర్యాటకులు సగటున 3,700 మంది మాత్రమే! ఈ దేశంలోని ప్రధాన ద్వీపంలో మనుషులు నివసిస్తుంటారు. ఈ దేశంలో భాగంగా నాలుగు పగడపు దీవులు కూడా ఉన్నాయి. ఈ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య కూడా తక్కువే! విత్రమైన ప్రదేశాలను చూడాలనుకునే ఉబలాటం గల కొద్దిమంది తప్ప వినోదయాత్రల కోసం పర్యటనలకు వెళ్లేవారెవరు ఈ దేశంవైపు చూడరు. ఈ దేశంలో ఏటీఎంలు ఉండవు. అందువల్ల డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే! పర్యావరణ మార్పుల కారణంగా సముద్రజలాలు పెరుగుతూ వస్తుండటంతో ఈ దేశం మరో యాభయ్యేళ్లలోగా పూర్తిగా నీట మునిగిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ దేశం చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయాయి. (చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..) -
Tuvalu: ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశం.. ఉనికి మాటేమిటి?!
తాజాగా ఈజిప్టులో ముగిసిన కాప్ 27 సదస్సు మరోసారి ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాలపై చర్చకు వేదిక అయ్యింది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో జరిగిన ఈ సమావేశం చివరకు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోగలిగినందుకు సంతోషించాల్సిందే. పర్యావరణ మార్పుల వల్ల నష్టపోతున్న బడుగు దేశాలను ఆదుకోవడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఈ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. వాస్తవంగా ప్రపంచం పర్యావరణ ప్రమాదం బారిన పడటానికి ప్రధాన కారణం కాలుష్య కారకాలుగా మారిన ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలే. గ్రీస్హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాల పైనే ఉంటుంది. అది ఒక చర్చనీయాంశం. ఈ సమావేశం సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం ‘టువాలు’. ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలో జరిగిన కాప్ 27 సమావేశంలో టువాలు ప్రపంచం ముందు ఒక సవాలుగా నిలబడింది. ప్రపంచ బాధ్యతను గుర్తు చేసింది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన అంశమే. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే మరో 60, 70 ఏళ్ళల్లో ఈ ద్వీప దేశం జల సమాధి కాకుండా ఎవరూ ఆపలేరు. టువాలు మొత్తం 9 ద్వీపాల సమూహం. హవాయి, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒకదాని వెంట ఒకటిగా చిన్న చిన్న దీవులు బారులు తీరి ఉంటాయి. దేశం మొత్తం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే సుమారు 6400 ఎకరాలు. 2022 జనాభా అంచనా ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 11 వేల 200. బ్రిటన్ నుండి 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి హైదరాబాద్ నగరం 542 మీటర్ల ఎత్తున ఉంటే... సముద్రం ఒడ్డునే ఉన్న విశాఖపట్నం 45 మీటర్ల ఎత్తున ఉంది. దీన్ని బట్టి టువాలు పరిస్థితిని అంచనా వేయవచ్చు. సముద్ర మట్టానికి ఇంకా తక్కువలో ఉన్న మరో ద్వీప దేశం మాల్దీవులు. సముద్ర మట్టాలు పెరుగుతున్న కొద్దీ ఈ దేశాల ఉనికి ప్రమాదం దిశగా పయనిస్తున్నట్లే. టువాలు కంటే ఆర్థికంగా కాస్త బలమైన మాల్దీవులు తమ దేశాన్ని కాపాడు కోవటానికి తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. 20 వేల మంది జనాభాకు కృత్రిమంగా నిర్మిస్తున్న ఫ్లోటింగ్ సిటీ ఆవాసంగా మారనుంది. ఇటువంటి ఏర్పాట్లు చేసుకునే స్థోమత టువాలుకి లేదు. అందుకే అది తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భౌగోళిక స్వరూపం, రోడ్లు, నిర్మాణాలు.. మొత్తంగా తన అస్తిత్వాన్ని భద్ర పరుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తమ దేశాన్ని వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికత ఉపయోగించి ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశంగా అయినా మార్చాలనే సంకల్పంతో ఉంది. ఇక్కడే కొన్ని కీలకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ దేశంలోని జనాభాకు భౌతికంగా భూ మండలంపై ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న. పోనీ ఏదో ఒక దేశం స్వాగతించినా వీరు ఆ దేశానికి వలసదారులు, లేదంటే ఆ దేశ పౌరులు అనే హోదాను మాత్రమే పొందగలుగుతారు. మరి టువాలు సార్వభౌమత్వం సంగతి ఏంటి? స్వయం పాలనకు అవకాశం కోల్పోవటమేనా? దేశం సముద్రంలో మునిగిపోతే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇప్పుడు ఉన్న హక్కులు, మెరైన్ సరిహద్దు పరిధిలో ఉండే సహజ వనరులను కోల్పోక తప్పదా? భౌతికంగా కనిపించని టువాలును ఐక్యరాజ్యసమితి ఒక దేశంగా గుర్తించే అవకాశం ఉంటుందా? టువాలు ఇవాళ ప్రపంచం ముందు ఒక ప్రశ్నగా నిలబడి ఉంది. (క్లిక్ చేయండి: ముందు నుయ్యి... వెనుక గొయ్యి) - రెహాన సీనియర్ జర్నలిస్ట్