ఐదేళ్ల తర్వాత రష్యాకు మోదీ.. కారణం ఇదే.. | Russia Invites PM Modi Victory Day Parade | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత రష్యాకు మోదీ.. కారణం ఇదే..

Apr 9 2025 1:46 PM | Updated on Apr 9 2025 3:07 PM

Russia Invites PM Modi Victory Day Parade

మాస్కో: రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని మాస్కోలో మే 9న జరగబోయే విజయ దినోత్సవ (విక్టరీ డే) పరేడ్‌కు ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయదినోత్సవ వార్షికోత్సవం జరగనుంది.

ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో  తెలిపారు. రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని రెడ్ స్క్వేర్‌లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్-రష్యా లమధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన గురించి భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

రష్యాలో నిర్వహించే విజయ దినోత్సవం  ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా సైనిక పరేడ్, యుద్ధ వీరులకు సన్మానం, చారిత్రక ఘటనలను స్మరించుకునే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రష్యా తన సంప్రదాయంగా కొనసాగిస్తోంది. 2005లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  రష్యా విజయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement