NASA: మెరుస్తున్న భూమి.. అందమైన చిత్రాలు తీసిన ఐఎమ్‌ వన్‌ | Nasa IM One Sends Earth Beautiful Pictures From Space | Sakshi
Sakshi News home page

భూమి అద్భుత చిత్రాలు తీసిన ఐఎమ్‌ వన్‌.. 22న చంద్రునిపై ల్యాండింగ్‌

Feb 18 2024 9:53 AM | Updated on Feb 18 2024 9:54 AM

Nasa IM One Sends Earth Beautiful Pictures From Space - Sakshi

కాలిఫోర్నియా: చంద్రునిపైకి నాసా పంపిన ఇంట్యూటివ్‌ మెషిన్‌(ఐఎమ్‌ వన్‌) నింగి నుంచి భూగోళం అద్భుతమైన చిత్రాలను తీసింది. ఈ చిత్రాల్లో భూమి వజ్రంలా మెరిసిపోతుండటం విశేషం. స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ నుంచి వేరుపడి రెండో దశ ప్రయాణం ప్రారంభించన వెంటనే ఐఎమ్‌ వన్‌ భూమి అందమైన చిత్రాలను కెమెరాలో బంధించింది. ఈ నెల తొమ్మిదో తేదీన కేప్‌కెనరావల్‌లోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌లో ఐఎమ్‌ వన్‌ నోవా సి ల్యాండర్‌ను నింగిలోకి పంపారు.

అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న నోవా సీ ల్యాండర్‌ చంద్రునిపై అడుగు పెడుతుంది. నాసా, ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ వాణిజ్య పరంగా కస్టమర్ల కోసం చేపట్టిన కమర్షియల్‌ లూనార్‌ పేలోడ్‌ సర్వీసెస్‌ ప్రోగ్రామ్‌(సీఎల్పీఎస్‌) కింద నోవా సి ల్యాండర్ చంద్రునిపై ప్రయోగాలు చేయనుంది.

ఈ దశాబ్దం చివర్లో చంద్రునిపైకి వ్యోమగాములను(నాసా ఆర్టెమిస్‌ ప్రోగ్రామ్‌) పంపేందుకుగాను అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఐఎమ్‌ వన్‌ వ్యోమనౌకలో నాసా ఆరు పేలోడ్‌లను అమర్చింది. ఇది చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్‌ అయితే 1972 తర్వాత అమెరికా  వ్యోమగాములతో సహా చంద్రునిపైకి పంపిన అపోలో మిషన్‌ తర్వాత రెండో మిషన్‌గా చరిత్రకెక్కనుంది.  

ఇదీ చదవండి.. పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement